పస్ట్ టైమ్ బుల్లితెరపై పవన్ కూతురు.. వీడియో వైరల్!
on May 4, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ల సంతానం అకీరా, ఆద్య. పవన్ తో విడాకులు తీసుకున్న తరువాత రేణు తన పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నారు. అకీరా, ఆద్యలను చూడడానికి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పూణే వెళ్తుంటారు. దీనికి సంబంధించిన ఫోటోలను రేణు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు. అలానే అకీరా, ఆద్య తమ తండ్రితో సమయం గడపడానికి అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటారు. 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆద్య.. పవన్ కళ్యాణ్ ను కలిసింది. కూతురంటే పవన్ కి చాలా ఇష్టం.
అయితే అకీరా, ఆద్య పబ్లిక్ గా పెద్దగా కనిపించరు. కనీసం అకీరా మెగాఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్ కు, ఈవెంట్స్ కు హాజరవుతుంటాడు కానీ ఆద్య అయితే చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అలాంటిది ఈమె ఓ టీవీ షోలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మధ్యకాలంలో రేణుదేశాయ్ టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. జీ తెలుగులో ప్రసారమవుతోన్న 'డ్రామా జూనియర్స్' షోకి జడ్జిగా రేణు దేశాయ్ వ్యవహరిస్తున్నారు. ఈ షో నిమిత్తం తరచూ హైదరాబాద్కు వచ్చి వెళ్తున్నారు రేణు. మదర్స్ డే సందర్భంగా ఈ షోని స్పెషల్ గా డిజైన్ చేశారు.
ఈ షోకి ఆద్యను గెస్ట్ గా తీసుకొచ్చారు. మొదటిసారి ఆద్య బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆద్య స్టేజ్ పైకి రాగానే.. రేణుదేశాయ్ వెళ్లి తన కూతుర్ని హత్తుకుని, ఆమె బుగ్గపై ముద్దు పెట్టింది. తిరిగి ఆద్య కూడా అమ్మకు కిస్ ఇచ్చింది. "యు ఆర్ మై బెస్ట్ గిఫ్ట్ ఎవర్'' అని రేణు.. ఆద్యను ఉద్దేశించి చెప్పగా.. ''మమ్మీ ఈజ్ ది బెస్ట్ మామ్ ఎవర్'' అని ఆద్య తన తల్లిపై ప్రేమను కురిపించింది. ఈ ప్రోమోను నెటిజన్స్ తెగ చూసేస్తున్నారు. మే 9న మదర్స్ డే కానుకగా.. రాత్రి 8 గంటలకు ఈ షో జీతెలుగులో ప్రసారం కానుంది!
Also Read